హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది..: హరీశ్ రావు

భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి హరీశ్ రావు( Ex Minister Harish Rao ) భేటీ అయ్యారు.

భువనగిరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) ఏం చేశారని ప్రశ్నించారు.

మన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి నల్గొండకు ద్రోహం చేశారని హరీశ్ రావు ఆరోపించారు.

గతంలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు.బీజేపీ - బీఆర్ఎస్ ఒక్కటేనని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.

"""/" / రాష్ట్రంలో బీజేపీ నేతలను ఓడించిందే బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) అని తెలిపారు.

బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని చెప్పారు.రాష్ట్రంలో అడుగుపెట్టకుండా అదానీని కేసీఆర్( KCR ) నిలువరించారని తెలిపారు.

కాంగ్రెస్ నేతలు వెళ్లి అదే అదానీతో అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ వచ్చి రెండు నెలలు కాకముందే రూ.

15 వేల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు.

బాలయ్యకు బౌన్సర్స్ అవసరం లేదు.. ఆయనే లాగిపెట్టి కొడతాడు: తమ్మారెడ్డి భరద్వాజ్