కమల్ గారాల పట్టి శృతి హాసన్ మళ్లీ తెలుగు సినిమాల్లో బిజీ అవుతుంది.స్టార్ హీరోల సరన నటిస్తూనే సీనియర్ స్టార్స్ సినిమాలకు సైన్ చేస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాలో క్రేజీ ఛాన్స్ పట్టేసిన శృతి హాసన్ ఈ సినిమాతో పాటుగా చిరు వాల్తేరు వీరయ్య మూవీలో కూడా నటిస్తుంది.ఈ సినిమా తర్వాత బాలయ్య వీర సిం హా రెడ్డి సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది.
ఇక్కడ విశేషం ఏంటంటే వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు.
ఈ రెండు సినిమాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
కొన్నాళ్లు కెరియర్ పూర్తిగా అటకెక్కేసింది అనుకున్న శృతి హాసన్ కి మళ్లీ తెలుగులో ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకోవడం చూస్తుంటే షాకింగ్ గా ఉంది.మరి ఈ సినిమాలు శృతి హాసన్ కి ఏ రేంజ్ హిట్ అందిస్తాయో చూడాలి.
సంక్రాంతి పోటీలో తనతో తను పోటీ పడుతున్న శృతి హాసన్ సమ్మర్ లో ప్రభాస్ సలార్ తో వస్తుంది.మొత్తానికి 2023 లో శృతి హాసన్ తెలుగు తెర మీద తన సత్తా చాటనుందని చెప్పొచ్చు.