టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం లవ్స్టోరీ.ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోండగా ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం పూర్తయ్యిందని, త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా ఈ సినిమా కథ ఓ సామాజిక అంశం చుట్టు తిరుగుతందనే వార్త చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవిల లవ్ స్టోరీకి కులం అడ్డు వస్తుందని, వారు దాని నుండి ఎలా తమ ప్రేమను గెలుచుకున్నారనేది సినిమా కథ అని తెలుస్తోంది.ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవిల పాత్రలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయిన చిత్ర యూనిట్ తెలిపింది.
శేఖర్ కమ్ములా తన ఫార్ములాను పక్కనబెట్టకుండా ఓ చక్కటి లవ్స్టోరీని మనకు చూపించేందుకు సిద్ధమయ్యాడని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక ఈ సినిమాను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
మరి కులం పెట్టే చిచ్చులో లవ్స్టోరీ గెలుస్తుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యాక చూడాలంటున్నాడు దర్శకుడు.ఈ సినిమాను నారాయణ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నాడు.