సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి తన సత్తా చాటడం ఖాయమని అంటున్నారు సినీ జనం.
అయితే ఇది మామూలు విజయం సాధించడం కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్ కానుందని అంటున్నారు చిత్ర యూనిట్.
పోకిరితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతోనూ మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు చిత్ర యూనిట్.
ఈ సినిమాలోని కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టంచనుందని తెలుస్తోంది.ఈ సినిమాలో మహేష్ చేసే పాత్ర పీక్స్లో ఉంటుందని, మేజర్ పాత్రలో, రాయలసీమలో ఆయన చేసే పాత్రలో చూపే వేరియేషన్స్ సూపర్గా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమాలో మహేష్ వన్ మ్యాన్ షో ఉంటుందని, ట్రెయిన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్యాంగ్, విజయశాంతితో ఎమోషనల్ సీన్స్, అదిరిపోయే క్లైమాక్స్, అందులో వచ్చే సర్ప్రైజ్ కలగలిసి సినిమాను ఇండస్ట్రీ హిట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక అనిల్ రావిపూడి కథ ఈ సినిమాకు మేజర్ బలం కానుందట.
రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.