ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ సభలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ మూడు ప్రజా ఆశీర్వాద సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు.దమ్మపేట, బూర్గంపాడ్ తో పాటు నర్సంపేట్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహించనుందన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటి గంటకు దమ్మపేటలో ఏర్పాటు చేసిన సభకు హాజరుకానున్నారు.తరువాత మధ్యాహ్నం 2 గంటలకు బూర్గంపాడ్ సభలో పాల్గొననున్న కేసీఆర్ అనంతరం నర్సంపేటలో సభకు హాజరవుతారు.
కేసీఆర్ ప్రచారం నేపథ్యంలో పార్టీ శ్రేణులు సభలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు.