హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Radisson drugs party )కేసులో గచ్చిబౌలి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా పోలీసుల విచారణకు నటి లిషి గణేశ్ హాజరయ్యారు.
అయితే గత కొన్ని రోజులుగా లిషి గణేశ్( Lishi Ganesh ) అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే.మరోవైపు రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు.అబ్దుల్ నెట్ వర్క్ గురించి ఆరా తీసేందుకు నార్కోటిక్ బ్యూరో అధికారులు గోవాకు వెళ్లారు.ఈ క్రమంలోనే అబ్దుల్ ద్వారా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అయిటన్లు అధికారులు గుర్తించారు.
ఇక ఇదే కేసులో ఏ10 గా ఉన్న సినీ దర్శకుడు క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.అయితే ఇప్పటికే క్రిష్ యూరిన్ రిపోర్టులో నెగిటివ్ రాగా బ్లడ్ రిపోర్టు రావాల్సి ఉంది.