నిన్న ఆసియా కప్ సీరియస్ లో భాగంగా ఇండియా జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై గెలవడం జరిగింది.ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత పాకిస్తాన్ బ్యాటింగ్ చేయగా 148 పరుగులు టార్గెట్ ఇవ్వడం జరిగింది.
దీంతో బరిలోకి దిగిన ఇండియా ప్రారంభంలో కొన్ని కీలకమైన వికెట్లు కోల్పోవడం జరిగింది.అనంతరం జడేజా ఇంకా హార్దిక్ పాండ్య నిలదొక్కుని రాణించారు.
మ్యాచ్ చివరి ఓవర్ వరకు రన్ అవుతూ ఉండటంతో ఉత్కంఠ భరిత పోరులో ఇండియా గెలుపొందడం జరిగింది.
అయితే పాకిస్తాన్ టీం పై ఇండియా గెలవడం పట్ల టీం ఇండియాకి ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు.
ఆల్ రౌండర్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించారని ప్రశంసించారు.ప్రత్యర్థి టీం పై గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిన టీమిండియా కు అభినందనలు అని ప్రధాని మోడీ ప్రశంసించారు.
చివరి ఓవర్ లో హార్దిక్ పాండ్య ఆడిన ఆట తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంది.తీవ్ర ఒత్తిడీలో కూడా అలవోకగా మంచి బ్యాట్టింగ్ చేయడం జరిగింది.