సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ కు తమ వ్యక్తిగత విషయంలో ఏదోక అడ్డంకులు ఉంటూనే ఉంటాయి.ఇక ముఖ్యంగా అభిమానుల నుండి మరీ ఎక్కువగా ఉంటుంది.
అభిమానులు.తమకు ఇష్టమైన హీరోయిన్స్ నెగటివ్ పాత్రలలోనో లేదా రొమాంటిక్ పాత్రలలో నటిస్తే మాత్రం బాగా మండిపడుతుంటారు.
అలాగే ఓ నటి తను ముద్దు సీన్స్ లో నటిస్తే ఒప్పుకునేవారు కాదట.ఇంతకీ ఆ నటి ఎవరో కాదు.
పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటి ప్రీతి.ఫ్యాషన్ రంగంలో మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ముంబైకి చెందిన ఈ బ్యూటీ తెలుగులో పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.ఒకే ఏడాదిలో మలయాళ, తమిళ, తెలుగు సినిమాలతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ బ్యూటీ నరసింహ నాయుడు, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాలలో నటించగా.
యమదొంగ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెప్పించింది.అంతేకాకుండా పంజాబీ, బెంగాలీ, రాజస్థానీ, ఉర్దూ భాషలలో కూడా నటించింది ప్రీతి.
ఇక 2017 లో నటనకు దూరమై నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.మరో నటుడు పర్వీన్ దాబాస్ ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.తనని ఇప్పటికీ చుయిముయి అమ్మాయి లేదా మొహబ్బతిన్ అమ్మాయి అని పిలుస్తారట.అలా పిలవడం తనకు బాగానే ఉంటుందని తెలిపింది.
ఇక తనను ప్రేక్షకులు మోడరన్ కంటే ట్రెడిషనల్ లో చూడటానికి ఇష్టపడుతుంటారని.కానీ వాళ్లు అలా ఇష్టపడటం వల్ల తనకు ఇబ్బంది కలుగుతుందని తెలిపింది.తను ముద్దు సీన్ లలో నటించడం తన అభిమానులకు నచ్చదని తెలిపింది.
ఇక తనకు ఇతర పాత్రల్లో కూడా చేయాలని ఉందట.ఎందుకంటే తనకు నిస్సహాయ కోడలిగా ఉండటం ఇష్టం లేదని తెలిపింది.