యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోన్నాడు.ఈ సినిమా షూటింగ్ను ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటున్న చిత్ర యూనిట్ లాక్డౌన్ కారణంగా షూటింగ్ను వాయిదా వేసింది.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్లో మనకు కనిపిస్తాడు.ఇక ఈ సినిమా పూర్తి కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని కూడా ఓకే చేశాడు.
మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమా రానుండటంతో అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను ఓ సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీలను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు దీపికా పదుకొనే.ఆమెను ఈ సినిమాలో నటింపజేసేందుకు చిత్ర నిర్మాత అశ్విని దత్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట.ఇందులో భాగంగా ఆమెను ఈ సినిమా కోసం ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మరీ నటింపజేయాలని చూస్తున్నారట.
మరి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎలా ఉండబోతుంది? అంత రెమ్యునరేన్ ఇచ్చి మరీ బాలీవుడ్ బ్యూటీనే ఎందుకు నటింపజేస్తున్నారు? ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.ఏదేమైనా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా చిత్ర యూనిట్ ఇంత భారీ బడ్జెట్ కేటాయిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.