యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాకి రాదేశ్యాం అనే పేరు పరిశీలిస్తున్నారు.
పీరియాడికల్ లవ్ స్టొరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సాహో తరహాలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఫ్రాన్స్ నేపధ్యంలో సినిమా కథ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.ఇప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్ నెక్స్ట్ సినిమా గురించి హాట్ టాపిక్ నడుస్తుంది.
మొన్నటి వరకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది.అయితే ఊహించని విధంగా ఇప్పుడు మరో దర్శకుడు తెరపైకి వచ్చాడు.
మహానటితో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న చిత్ర దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఉంటుంది.ఈ సినిమాని వైజయంతి బ్యానర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని అఫీషియల్ గా ప్రభాస్ తో కలిపి ఎనౌన్స్ చేశారు.
తాజాగా దీనికి సంబందించిన ప్రకటన వచ్చింది.ఇక ఇది ప్రభాస్ కెరియర్ లో మొదటి సైన్సు ఫిక్షన్ మూవీగా ఉండబోతుందని తెలుస్తుంది.అయితే ఇది పాన్ ఇండియా మూవీనా లేక కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమా అనే విషయాలు ఇంకా ప్రకటించలేదు.ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు కావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
.