తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఈ మేరకు జనసేనాని రెండు రోజులపాటు ప్రచారం నిర్వహించనున్నారు.బీజేపీ -జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్న పవన్ కల్యాణ్ ఇవాళ వరంగల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
రేపు కొత్తగూడెం, సూర్యాపేటతో పాటు దుబ్బాకలో పర్యటించి ప్రచారం చేయనున్నారు.అయితే పవన్ కల్యాణ్ ప్రచారంతో బీజేపీ -జనసేన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహన్ని నింపనుందని తెలుస్తోంది.