ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో క్రేజీ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.ఎన్.టి.ఆర్ 30వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ కుదిరింది.అయితే ఈ సినిమా కోసం ముందు ఓ కథ అనుకోగా ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎలాగు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని అంచనా వేస్తున్న తారక్ కథ మార్చి పాన్ ఇండియా రిలీజ్ చేసేలా మరో కథ సిద్ధం చేయమన్నాడట.చేసేదేమి లేక తారక్ కోరినట్టు ముందు అనుకున్న కథ మార్చి మరో కథ లైన్ లో పెట్టాడని టాక్.
అయితే కొరటాల శివ ఎన్.టి.ఆర్ కు రెండు లైన్లు వినిపించగా ఆ రెండు తారక్ కి పెద్దగా నచ్చలేదని టాక్.
అందుకే కొరటాల శివ మళ్లీ కొత్త కథ కోసం వేట మొదలు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు .ఎన్.టి.ఆర్, కొరటాల శివ జనతా గ్యారేజ్ కాంబో క్రేజీగా మారనుంది.ఆల్రెడీ హిట్టు కొట్టిన కాంబో అంటే అంచనాలు భారీగా ఉంటాయి.
అయితే ఈ సారి పాన్ ఇండియా సినిమా కాబట్టి సంథింగ్ స్పెషల్ ఉండాలని ఎన్.టి.ఆర్ కోరుతున్నాడట.ఈ సినిమా తర్వాత కె.జి.ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా లైన్ లో పెట్టాడు తారక్.అది కూడా నేషనల్ వైడ్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.