బాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే మరియు రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు.డ్రగ్స్ కేసు విచారణలో వీరి పేర్లు బయటకు వచ్చిన కారణంగా వారికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు వీరిని ప్రశ్నించనున్నారు.
ఈ విషయమై జాతీయ మీడియాలో రెండు రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ క్లారిటీగా నేడు అధికారులు వాళ్లకు నోటీసులు పంపించినట్టు గా తెలుస్తోంది.
ఈ విషయమై ఇప్పటి వరకు హీరోయిన్లు ఎవరు కూడా స్పందించలేదు.
దీపికా పడుకొనే మరియు రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే కాకుండా సారా అలీ ఖాన్ కు కూడా నోటీసులు పంపించినట్టు గా తెలుస్తుంది.ఎన్సీబీ అధికారుల ముందు విచారణకు హాజరై కేసులో వారికి ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉంది.
డ్రగ్స్ డీలర్ల వద్ద మీకు సంబంధించిన సమాచారం ఎందుకు ఉంది అంటూ ఎన్సీబీ వారు ఈ హీరోయిన్స్ ను ప్రశ్నించే అవకాశం ఉంది.వాటికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంది.
ఒకవేళ వీళ్ళ నుండి ఏదైనా కీలక సమాచారం అంది వారు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా తేలినట్లయితే రియా చక్రవర్తి మాదిరిగానే వీళ్ళను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.వీళ్ళ విచారణ తర్వాత మరింత మంది కూడా ఈ కేసులో బుక్కు అయ్యే అవకాశం ఉందంటూ సమాచారం.
ఇప్పటి వరకు బాలీవుడ్ టాలీవుడ్ ఇతర భాషల సినిమాల్లో పరిశ్రమలకు చెందిన 50 మంది వరకు ఈ కేసులో ఉండి ఉంటారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆవిషయం పై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.