ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) కుమారుడు అనంత్ అంబానీ( Anant Ambani ) రాధిక మర్చంట్( Radhika Marchent ) ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఈ పెళ్లి వేడుకలలో బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం ఇక్కడే మూడు రోజులపాటు పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఈ పెళ్లి వేడుకలలో సందడి చేసినటువంటి తరుణంలో నాగార్జున( Nagarjuna ) గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగార్జున ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్తలు తమ ఇంటికి సంబంధించినటువంటి వివాహ కార్యక్రమాలలో కేవలం 20 నిమిషాలు కనిపించి ఒక ఐదు నిమిషాలు పెర్ఫార్మెన్స్ చేసినందుకు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు అంటూ ఈయన వెల్లడించారు.ఇలా పెళ్లిళ్లలో కనిపించడం కోసం పెద్ద ఎత్తున డబ్బులను ఆఫర్ చేస్తున్నారని నాగార్జున తెలిపారు.ఇక తనకు కూడా ఇలాంటి ఆఫర్స్ చాలా వచ్చాయని కానీ నేను అలాంటి పెళ్లిళ్లకు వెళ్లలేదని ఈ సందర్భంగా నాగార్జున చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అయితే ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి వేడుకలలో కూడా ఇదే విధంగా జరిగింది.అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి సెలబ్రిటీలందరికీ కూడా పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం.ఇలా ఈ పెళ్లి వేడుకలలో బాలీవుడ్ సెలబ్రిటీలు( Bollywood Celebrities ) అందరూ కూడా కనిపించడంతో గతంలో నాగార్జున చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.