కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ అధికారులకు మరోసారి సమాచారం అందించారు.ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుందని చెప్పారు.
రేపు విచారణ జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు సూచించిందని అవినాశ్ రెడ్డి తెలిపారు.తన తల్లి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈనెల 27 వరకు విచారణకు రాలేనని పేర్కొన్నారు.
ఈనెల 27 తరువాత అందుబాటులో ఉంటానని వెల్లడించారు.సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని అవినాశ్ రెడ్డి సీబీఐని కోరారు.