ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వినియోగించడం సర్వసాధారణం అయింది.కొంతమంది సోషల్ మీడియా లో వీడియోలను టైం పాస్ కోసం వీక్షిస్తూ ఉంటే.
మరికొందరు అయితే సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అయితే తాజాగా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి కొంతమంది విఫలమవుతుంటే.
మరికొందరు రికార్డులు సొంతం చేసుకుంటారు.తాజాగా ఒక యువకుడు ఏనుగుతో ( Elephant ) కలిసి రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలని ప్రయత్నించగా చివరకు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో( Uttar Pradesh ) చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళితే.ఉత్తరప్రదేశ్లోని బిజినూర్ జిల్లాలో పలు గ్రామాలలో ఏనుగులు తిరగడం సర్వసాధారణం.అయితే తాజాగా ఒక అడవి ఏనుగు హబీబ్ బావాలా గ్రామంలోకి ప్రవేశించడం ఆ ఏనుగును చూసేందుకు చాలామంది ప్రజలు అక్కడికి వెళ్లారు.ఈ క్రమంలో 30 సంవత్సరాలు గల మురసాలి ఏనుగుతో రీల్( Reel ) చేసి ఫేమస్ అవ్వాలని ప్రయత్నించాడు.
ఆ యువకుడు ప్రయత్నంలో ఏనుగును భయపెట్టాలని ప్రయత్నించగా.ఏనుగు ఆ యువకుడుతో పాటు గ్రామ ప్రజలను వెంబడించింది.దీంతో గ్రామస్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
పరిగెత్తిన ఏనుగు మురసాలిను ఏనుగు కాలువతో యువకుడిని తొక్కేసింది.అంతేకాకుండా ఏనుగు తొండంతో 25 అడుగుల ఎత్తున విసిరి కొట్టింది.దీంతో గాయాలు పాయలైన ఆ యువకుడిని గ్రామస్తులు సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువకుడు చనిపోయినట్లు డాక్టర్ తెలియజేశారు.
ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు( Forest Officers ) వెంటనే ఆ ఏనుగును తిరిగి అడవిలోకి పంపించేశారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి