ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఈ ఘటన జరిగింది.
ఎండలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు.
గమనించిన భారాస శ్రేణులు కవితను వెంటనే చెట్టు నీడకు తీసుకెళ్లి సపర్యలు చేశారు.
అనంతరం కోలుకున్న కవిత తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.