కన్నడ నటుడు చిరంజీవి సర్జా భార్యగా, నటిగా మేఘనా రాజ్ ప్రేక్షకులకు సుపరిచితమనే సంగతి తెలిసిందే.గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మేఘనా రాజ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానని చెప్పుకొచ్చారు.
చిరంజీవి సర్జాకు సన్నిహిత వ్యక్తులలో ఒకరైన పన్నగ భరణ నిర్మాతగా తెరకెక్కే ఒక సినిమాలో తాను నటిస్తున్నానని మేఘనా రాజ్ చెప్పుకొచ్చారు.విశాల్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో మేఘనా రాజ్ నటించడంతో పాటు ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా మేఘనా రాజ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయాన్ని వెల్లడించారు.
భర్త పుట్టినరోజున ఈ మేరకు ప్రకటన చేస్తూ తాను భర్త కలను నెరవేర్చబోతున్నానని మేఘనా రాజ్ చెప్పుకొచ్చారు.ఈ విషయంను తెలియజేయడానికి ఇంతకు మించి సమయం లేదని ఆమె కామెంట్లు చేశారు.
నిర్మాత పన్నగ భరణ వల్లే తాను ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించానని ఆమె చెప్పుకొచ్చారు.
సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నందుకు తనకు ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టుగా ఉందని మేఘనా రాజ్ చెప్పుకొచ్చారు.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మేఘనా రాజ్ మరిన్ని ఆఫర్లతో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.గతేడాది జూన్ నెల 7వ తేదీన గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతి చెందారు.
చిరంజీవి సర్జా మృతి చెందే సమయానికి మేఘనా రాజ్ గర్భవతి కావడం గమనార్హం.మేఘనా రాజ్ తన కొడుకుకు రాయల్ రాన్ సర్జా అనే పేరు పెట్టారు.మేఘనా రాజ్ కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మేఘనా రాజ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.