ఒలింపిక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ వరల్డ్ నెంబర్ వన్ బాక్సర్, ఇండియన్ బాక్సర్ మేరీకామ్, నేషనల్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ఫైనల్ రౌండ్ కి క్వాలిఫై అయ్యారు.అయితే వీరిలో ఒలింపిక్ కి ఎవరిని పంపించాలి అనే విషయమపై సెలక్టర్లు తర్జన బర్జన పడిన తర్వాత వారి మధ్య పోటీ పెట్టాలని నిర్ణయానికి వచ్చారు.
తాను మేరీకామ్ తో పోటీ పడతానని జరీన్ కూడా చెప్పింది.దీంతో ఇద్దరి మధ్య పోటీ పెట్టగా అందులో మేరీకామ్ విజేతగా నిలిచింది.
అయితే ఈ పోటీ అనంతరం ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఓడిపోయినా తర్వాత బయటకి వచ్చిన నిఖత్ జరీన్ మీడియాతో మేరీకామ్ తీరుని విమర్శించింది.
ఆమె పద్ధతి తనంకి నచ్చలేదని, బౌట్ అయిన తర్వాత ఒక సంప్రదాయంగా కరచాలనం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్తారని, కాని ఆమె అలా చేయలేదని, అలాగే ఆమె రింగ్ లో తనని అవమానించిందని వ్యాఖ్యానించింది.అయిన కూడా ఆమె ఒక లెజెండ్ కాబట్టి తాను గౌరవిస్తానని చెప్పింది.
ఇక ఈ వ్యవహారంపై మేరీకామ్ కూడా స్పందించింది.అసలు ఆమెకి నేను ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, పక్కవాళ్ళని గౌరవం ఇవ్వలేని అలాంటి వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.
అలాంటి వ్యక్తులని కూడా నేను ఇష్టపడను.ఏదైనా ఉంటే రింగ్ లో తేల్చుకోవాలి.
ఇలా బయట మాట్లాడకూడదు అని విమర్శలు చేసింది.ఇలా ఒక లెజెండ్ బాక్సర్, ఒక వర్ధమాన బాక్సర్ మధ్య రాజుకున్న ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.