మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డుని అందుకున్న అందాల భామ కీర్తి సురేష్.ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా ఉంది.
సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబుకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.దీంతో పాటు మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మరక్కర్ మూవీలో యువరాణి పాత్రలో కనిపిస్తుంది.
అలాగే మరో గుడ్ లక్ సఖి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.దీంతో పాటు తమిళంలో సానికాయుధం అనే మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా మరో మూడు సినిమాల వరకు లైన్ లో ఉన్నాయి.ఇలా అరడజనుకి పైగా సినిమాలతో కీర్తి సురేష్ ఫుల్ బిజీ హీరోయిన్ గా సౌత్ లో ఉంది.
సౌత్ లో అన్ని బాషలలో ఈ అమ్మడు సందడి చేస్తుంది.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో ఫిమేల్ సెంట్రిక్ గా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ లో మిస్ ఇండియా అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ ఒటీటీలో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.హీరోయిన్ క్యారెక్టర్ పెర్ఫెక్ట్ గా ఉన్న స్టొరీ నేరేషన్ కంప్లీట్ గా గాడి తప్పడంతో డిజాస్టర్ అయ్యింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ యుట్యూబ్ లో రిలీజ్ చేశారు.ఇక ఈ మూవీ రిలీజ్ చేసిన 24 గంటల్లో ఏకంగా 17 మిలియన్ వ్యూస్స్ సొంతం చేసుకుంది.
ఓక ఫిమేల్ సెంట్రిక్ మూవీకి ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ రావడం నిజంగా రికార్డ్ అని చెప్పాలి.దీనిని బట్టి నార్త్ లో కీర్తి సురేష్ క్రేజ్ ఎలా ఉందో అర్ధమవుతుంది.
బాహుబలి తర్వాత సౌత్ సినిమాల పట్ల నార్త్ ఇండియా ప్రేక్షకుల వైఖరి పూర్తిగా మారిందని మిస్ ఇండియాకి వచ్చిన వ్యూస్ బట్టి చెప్పొచ్చు.