బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పెను ప్రమాదంలో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.ఈ నేపథ్యంలో కాళేశ్వరంపై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వర్షాలు, వరదలు లేకపోయినా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోయిందన్న రేవంత్ రెడ్డి ఇందుకు నాణ్యతా లోపమేనని ఆరోపించారు.గతంలో రైతులను బస్సుల్లో తీసుకెళ్లి చూపించిన మీరు ఇప్పుడు వంతెన వద్దకు ఎవరినీ ఎందుకు వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు.