తెలుగులో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన “పటాస్” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ “సృష్టి సోది” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ తన తదుపరి చిత్ర కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమైంది.
దీంతో ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఖాళీగా గడుపుతోంది.
తాజాగా ఈ అమ్మడు గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఇటీవలే టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న “మరణ మృదంగం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.కాగా ఈ చిత్రానికి నూతన దర్శకుడు వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 40 శాతం చిత్రీకరణ పనులు పూర్తయినట్లు సమాచారం.
ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో చివరగా సృష్టి సోది ప్రముఖ దర్శకుడు ఇ.సత్తిబాబు దర్శకత్వంలో వచ్చిన “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది.
దీంతో ఈ అమ్మడు తన తదుపరి చిత్ర కథల విషయంలో కొంతమేర ఆచి తూచి నిర్ణయం తీసుకుంటోంది.కాగా ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “వాడు వీడు కాదు” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.