బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీపై యాంకర్ శ్యామల స్పందించారు.బెంగళూరు రేవ్ పార్టీ ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తనకు తెలియదని యాంకర్ శ్యామల తెలిపారు.
తాను ఓ పొలిటికల్ పార్టీలో ఉన్నానన్న ఆమె కావాలనే తనపై, తన పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కొందరు కావాలనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.నిజాన్ని చెప్పకుండా ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.