రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో బియర్ఎస్ పార్టీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఉపాధి హామీ కూలీలకు అల్పాహార కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు గ్రామంలో ని ఉపాధి పని చేస్తున్న చిట్టివాని కుంట వద్దకు చేరుకొని వారితో మాట్లాడి బియర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కారు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ ల ఫోరమ్ మండల మాజి ఉపాధ్యక్షులు, గ్రామ ఎక్స్ సర్పంచ్ బొల్లం వెంకటేశం, మార్కెట్ కమిటీ ఎక్స్ డైరెక్టర్ ఓల్లాల రవీందర్, పార్టీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు మల్యాల రాజశేఖర్,గరిగే సత్యనారాయణ, బట్టి క్రాంతి,జక్కుల స్వామి,అక్కేమ్ ప్రవీణ్, జాన్, దారవేణి రాజు, రాము, గరిగే లక్ష్మి నారాయణ,ప్రభాకర్, గరిగే పర్శరామ్, దారవేణి ఎర్ర బాలయ్య, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.