రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన ఇక శేషవ్వ (46) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
జరిగిన ఘటనపై ఎస్సై శ్రీకాంత్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.మృతురాలికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.