మనలో చాలామంది ముఖం మీద ఎలాంటి మచ్చలు( Spots ) లేకుండా అందంగా, తెల్లగా మెరిసిపోవాలని అనుకుంటూ ఉంటారు.ముఖం మీద నల్లని మచ్చలు, మంగు మచ్చలు లాంటివి ఉంటే ముఖం అందంగా కనిపించదు.
అలాగే దీని వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు.ఈ సమస్యకు ఇంట్లోనే మంచి పరిష్కారం ఉంది.
వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతో మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.ఒక బౌల్ లో రెండు స్పూన్ల పెరుగు,( curd ) ఒక స్పూన్ పంచదార పొడి, అర చెక్క నిమ్మరసం( Lemon Juice ) వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమంలో రసం పిండేసిన నిమ్మచెక్కను మంచి ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఈ విధంగా ఐదు నిమిషాల పాటు చేయాలి.
ఇక 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా తరచూ రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖంపై మంగు మచ్చలు( Dark spots ), నలుపు, తెలుపు మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.అయితే ప్రతి ఒక్కరు కూడా చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోవాలని చర్మం చాలా హెల్దీగా, సహజంగా కనిపించాలని, అందంగా కనిపించాలని అనుకుంటుంటారు.అలాంటి వారు ఎంతో ఓపికగా ఇలాంటి చిట్కాలను పాటిస్తే మాత్రం ఎలాంటి కాస్మెటిక్స్ సహాయం లేకుండానే అందంగా మెరిసిపోవచ్చు.
అయితే పెరుగు సహజ సిద్ధమైన ఎక్స్ ఫ్లోడిస్ గా పనిచేసి చర్మంపై ఉన్న నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది.
అలాగే నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి.ఇక పంచదార ( Sugar )చర్మం మీద మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి.అయితే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించాలి.డాక్టర్ల సలహాలు పాటించాలి.
అలాగే సమస్య చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి చిట్కాలు పాటించి పరిష్కారం చూసుకోవాలి.సమస్య పెద్దగా మారిపోయాక మనం ఎన్ని కాస్మెటిక్స్( Cosmetics ) ఎన్ని చిట్కాలు వాడిన మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు.