రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని బంటు ఆనందం గత కొద్ది నెలల నుండి అనారోగ్యంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.విషయం తెలుసుకున్న మల్యాల గ్రామ యువకుడు పొంచెట్టి వెంకటేష్ సన్నాఫ్ తిరుపతి శనివారం రోజున కుటుంబ సభ్యులకు
ఆర్థిక సాయం 5000 రూపాయలు అందించారు.
ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆనందం గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందాడని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఈసరి శ్రీనివాస్ సంటి ప్రసాద్ రొండి సాగర్ బంటు అంజయ్య,రొండి రాజు పాల్గొన్నారు.