రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బంటు ఆనందం అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా గత నాలుగు రోజుల క్రితం మృతి చెందగా విషయం తెలుసుకున్న ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉన్న గల్ఫ్ కార్మికులు నిరుపేద కుటుంబానికి
ఆర్థిక సాయంగా పదిహేను వేల రూపాయలు , క్వింటాల్ బియ్యం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
బంటు ఆనందం కుటుంబం ఆర్థికంగా నిరుపేద కుటుంబం కావడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న దుబాయ్ కార్మికులు పంపించిన ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అందజేయడం జరిగింది అన్నారు.