సాధారణంగా పాత వస్తువులను లేదా నచ్చిన వస్తువులను ఇతరులకు ఎంతో కొంత డబ్బుకు మనం అమ్మకానికి పెడతాం.అయితే తాజాగా ఒక మహిళ మాత్రం ఏకంగా తన మాజీ భర్తను అమ్మకానికి పెట్టింది.
వినడానికి విడ్డూరంగా, వింతగా అనిపించినా ఇది అక్షరాలా నిజం.ఫ్లోరిడాలో నివసిస్తున్న ఓ మహిళ తన ఇల్లు, అందులోని ఫర్నిచర్ తో పాటు మాజీ భర్తను రూ.5.30 కోట్లకు విక్రయానికి పెట్టింది.ఇప్పుడు ఆమె అమ్మకపు ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ నివ్వెరపరుస్తోంది.ఇది తెలుసుకున్న వారంతా నోరెళ్లబెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే, క్రిస్టల్ బాల్ (43) ఏళ్ల మహిళకు పనామా సిటీ బీచ్ సమీపంలో ఒక పెద్ద ఇల్లు ఉంది.ఇందులో స్విమ్మింగ్ పూల్, హాట్ టబ్, 3 బెడ్రూమ్స్ వంటి చాలా సౌకర్యాలు ఉన్నాయి.
అయితే వీటన్నిటితోపాటు ఆమె తన మాజీ భర్త రిచర్డ్ చైలౌ (54)ని ఆమె తన ప్రకటనలో అమ్మకానికి పెట్టినట్టు తెలిపింది.క్రిస్టల్ బాల్, రిచర్డ్ పెళ్లయిన ఏడేళ్లకు డివోర్స్ తీసుకున్నారు.
విడాకులు తీసుకున్న తర్వాత ఏడేళ్ల వరకు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు.అలాగే తమ పిల్లల బాగోగులను చూసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు క్రిస్టల్ కు ఆ ఇంట్లో నివసించాలని అస్సలు అనిపించడం లేదట.అందుకే మాజీ భర్తతో సహా ఇంటినే అమ్మేందుకు ఆమె సిద్ధమైంది.
ఇంటిని, ఇంట్లో ఉన్న తన ఎక్స్ హస్బెండ్ ఫొటోలను ఆమె ఆన్లైన్ సైట్లో అప్లోడ్ చేసింది.
ఈ ప్రకటనలో ఆమె తన మాజీ భర్త గురించి కొన్ని విశేషాలు కూడా పంచుకుంది.
రిచర్డ్ అద్భుతమైన వంటగాడు, మంచి వినికిడి శక్తి గలవాడు, వాసనను గుర్తించగలిగినవాడు, బలశాలి అని క్రిస్టల్ వివరించింది.రిచర్డ్ ఏ పనైనా చేయగలడని, ఇంటిని క్లీన్ కూడా చేస్తాడని ఆమె చెప్పింది.
ఇల్లు కొనుగోలు చేసుకునే వారు తమతో మాజీ భర్తను కూడా ఇంట్లోనే ఉంచుకోవాలని చెప్పడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.అయితే ఈ ప్రకటన తమ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు అనుగుణంగా లేదని ఒక సైట్ చాలాసార్లు ఆమె ప్రకటనను డిలీట్ చేసింది.
మళ్లీ ఆమె తన ప్రకటనను పోస్ట్ చేసింది.