మామూలుగా అయితే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకొని ఆ తరువాత విభేధాలు వస్తే విడిపోయిన తరువాత తిరిగి వారిని చూడడానికి కూడా ఇష్టపడరు.కానీ సినీ పరిశ్రమలో మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది.
ఎంతో గాఢంగా ప్రేమించుకొని విడిపోయినప్పటికీ కూడా చాలా మంది తిరిగి వారితోనే కలిసి సినిమాలు చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి.ఇవన్నీ సినీ పరిశ్రమలో సర్వసాధారణం అని చెప్పాలి.
అయితే హీరో,హీరోయిన్స్ గా అయితే పర్లేదు కానీ,మరి హీరో కి మదర్ గా లవర్ నటించాలి అంటే కొంచం కష్టం అనే చెప్పాలి.ఇంతకీ ఈ భారతం మొత్తం ఎవరికోసం అని అనుకుంటున్నారా.
బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు రణ్ బీర్ కపూర్,దీపికా పదుకొనె.వీరిద్దరూ ఒకప్పుడు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో అందరికీ తెలిసిందే.
అయితే ఎంతో గాఢంగా ప్రేమించుకున్న వారు ఆ తరువాత విడిపోయి స్నేహితులుగా ఉంటామని చెప్పడం ఆ తరువాత దీపికా రణ్ వీర్ సింగ్ ను వివాహం చేసుకోవడం జరిగిపోయింది.
అయితే వీరిద్దరూ విడిపోయినప్పటికీ కూడా ఇద్దరూ కలిసి ‘తమాషా’ చిత్రంలో కూడా నటించారు.
అయితే ఒకప్పుడు లవర్స్ ఆయిన వీరు జోడి గా నటిస్తే పర్లేదు కానీ మరి మాజీ లవర్ కి తల్లి క్యారెక్టర్ అంటే కొంచం ఇబ్బంది అనే చెప్పాలి.ఎందుకంటే రణ్ బీర్ కపూర్,అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా సోషియా ఫాంటసీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ చిత్రం లో రణ్ బీర్ కపూర్ కు తల్లిదండ్రులుగా రియల్ లైఫ్ కపుల్ దీపిక పదుకొణె, రణ్వీర్ సింగ్లు నటించాలని అడిగారట.ఇందుకు రణ్వీర్, దీపిక అస్సలు ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ కు తల్లి దండ్రులుగా ఆ ఇద్దరూ అయితే బాగుంటుంది అని భావించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ వారిని కోరగా దానికి ఆ కపుల్స్ నిరాకరించినట్లు తెలుస్తుంది.అయితే నెటిజన్లు కూడా అయాన్ అసలు ఆలా ఎలా ఆలోచించాడు అంటూ తెగ మండిపడుతున్నారు.
ఒకప్పుడు లవర్స్ గా ఉన్న వారు ఇప్పుడు ఈ సినిమా లో ఎలా తల్లి,కొడుకుగా నటిస్తారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
‘బ్రహ్మాస్త్ర’ సినిమాను భారీ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు.భారతీయ చలన చిత్ర పరిశ్రమ కనీవినీ ఎరుగని రీతిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు.ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది.
అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, డింపుల్ కపాడియా, షారుక్ ఖాన్ వంటి స్టార్ నటులతో పాటు టాలీవుడ్ కింగ్ నాాగార్జున కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.అయితే మొత్తం రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తుండగా, క్రిస్మస్కు ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.