రాజన్న సిరిసిల్ల జిల్లా: అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి తన వంతు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు( Chalmeda Lakshmi Narasimha Rao ).వివరాల్లోకి వెళ్ళితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వేములవాడ అర్బన్ మండలంలోని గుర్రంవాని పల్లెలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన వంగపల్లి లక్ష్మీ( Vangapalli Lakshmi ) అనే మహిళ తన మనవడు అనారోగ్యంతో బాధపడుతున్నాడనే విషయాన్ని ప్రచారంలో ఉన్న చల్మెడ దృష్టికి తీసుకువెళ్లింది.వెంటనే స్పందించిన లక్ష్మీ నరసింహా రావు, జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డితో కలసి లక్ష్మీ ఇంటికి వెళ్లి చిన్నారి ఆరోగ్య స్థితిని చూసి చలించిపోయారు.
తక్షణ సాయం కింద ఆర్థిక సాయం అందించారు.రాబోయే రోజుల్లో చిన్నారి మెరుగైన వైద్యం కొరకు తన వంతు సహకారం ఉంటుందని, దైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
వారి వెంట సర్పంచులు లక్ష్మారెడ్డి, స్వయంప్రభ, మహిళ నాయకురాలు కొమురవ్వ తదితరులు ఉన్నారు.