రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) బొప్పపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తి తేదీ 29.05.2024 న పోలీస్ స్టేషన్కు వచ్చి తన యొక్క సెల్ ఫోన్ బొప్పాపూర్ గ్రామంలో పోయినది అని ఫిర్యాదు చేయగా, అతని ఫిర్యాదు మేరకు అతని యొక్క సెల్ ఫోన్ ఐ ఎమ్ ఈ ఐ నెంబర్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ లో అప్లోడ్ చేయగా , అట్టి సెల్ఫోన్ దొరికిన వ్యక్తిని గుర్తించి, సెల్ ఫోను స్వాధీనం చేసుకొని, తిరిగి ఫిర్యాది కి బుధవారం ఎల్లారెడ్డిపేట ఎస్.ఐ.రమాకాంత్ ( SI Ramakant ) అందించడం జరిగింది.
ఇకనుండి ఎవరు సెల్ఫోన్ అయినా మిస్సయినచో వారు నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసిన, లేదా వారు ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేసుకున్న వారి సెల్ ఫోన్ త్వరగా గుర్తించడానికి అవకాశం ఉందని ఎల్లారెడ్డిపేట ఎస్.ఐ తెలపడం జరిగింది.