గత నాలుగు, ఐదు ఏళ్లలో టాలీవుడ్ కి వచ్చిన కొత్త హీరోయిన్స్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు.వారే కృతి శెట్టి మరియు శ్రీలీల.
వీరితో పాటు అనేక మంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి వచ్చిన వీరికి వచ్చినంతా పేరు మిగతా వారికి రాలేదు.కరోనా టైం లో కరోనా కన్నా వేగంగా కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ఒక రెండు మూడేళ్ల వరకు వరస పెట్టి సినిమాలు తీసింది.
అలాగే పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీలీల ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకుంది.ఆ తర్వాత ఇద్దరికి ఘోర పరాజయాలు బాగానే దక్కాయి.
దానితో అన్ని సర్దుకొని పక్క భాషలకు షిఫ్ట్ అయిపోతున్నారు.

ప్రసాదం కైతే శెట్టి తాజాగా శర్వానంద్ తో మనమే( Manamey ) అనే చిత్రంలో నటించిన అది అనుకున్నంత బాగా వర్కౌట్ అవ్వలేదు.అయినప్పటికి ఆమెకు తమిళ్ మరియు మలయాళ భాషల్లో సినిమాలు ఉన్నాయి దాంతో ఆమె ఫోకస్ అక్కడే పూర్తిగా పెట్టింది.అయితే శ్రీలీల తాజాగా రవితేజ తో కొత్త సినిమా ప్రకటన చేసింది.
దీనితో ఆమె టాలీవుడ్ లో కంబ్యాక్ అవ్వాలని ఎదురు చూస్తుంది.వీరిద్దరూ వాటిలోనే మరొక హీరోయిన్ కూడా ఫుల్ హల్చల్ చేస్తుంది.
ఒక సినిమా కూడా విడుదలవ్వకుండానే అందరు చూపు తన వైపు తిప్పుకుంది.ఆమె మరెవరో కాదు భాగ్యశ్రీ బోర్సే.

రవితేజ హరి శంకర్( Hari Shankar ) కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతుంది.ఈ సినిమా సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ( Bhagyashri Borse)ని ఎంచుకున్నారు.ఈ చిత్రం తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి సైతం భాగ్యశ్రీ హీరోయిన్ గా ఎంపికయింది.దాంతో ఒక సినిమా విడుదలవ్వకుండానే ఇద్దరు స్టార్ హీరోలను లైన్ లో పెట్టింది.
ఈ అమ్మడు దాంతో ఈ అమ్మడు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో కృతి శెట్టి లేదా మరో శ్రీ లీల ఈ అవకాశాలు ఉన్నాయని గట్టిగా అందరూ అనుకుంటున్నారు.







