BRS MLA Lasya Nanditha ; నల్గొండ సభకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కారు ప్రమాదానికి గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!!

కృష్ణా జలాలకు సంబంధించి నల్గొండలో బీఆర్ఎస్( BRS ) సభ నిర్వహించడం తెలిసిందే.కృష్ణానది జలాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణ అంటూ నిర్వహించిన ఈ సభలో కేసిఆర్ కాంగ్రెస్( congress ) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 Brs Mla Met With A Car Accident On His Way Back From Nalgonda Sabha-TeluguStop.com

అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా నిర్వహించిన ఈ సభకి భారీ ఎత్తున ప్రజలు రావడం జరిగింది.తన ప్రాణాన్ని లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లు కేసిఆర్ ( KCR )సంచలన స్పీచ్ ఇచ్చారు.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు హక్కులు కాపాడటం ప్రతిపక్ష నేతలుగా తమ కర్తవ్యం అని సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది.రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చాం.

ఇప్పుడు ఆ కరెంటు యాడ పోయింది.

దద్దమ్మల రాజ్యమంటూ మండిపడ్డారు.ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే బజారులో నిలబెడతామని హెచ్చరించారు.ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఇచ్చిందో ఆ విధంగా కరెంటును పునరుద్ధరించాలి.

ఇంకా అనేక విషయాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసిఆర్ హెచ్చరించారు.అయితే ఈ సభకు హాజరై తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( BRS MLA Lasya Nanditha ) నార్కెట్పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీ కొట్టింది.దీంతో కారు ముందు టైరు ఉడిపోయింది.

ఈ ఘటనలో ఎమ్మెల్యే తలకు స్వల్ప గాయమైంది.దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆమె సోదరీ కూడా కారులోనే ఉన్నారు.నల్గొండ బీఆర్ఎస్ సభ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube