ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Astrologer Venu Swamy ) తరచూ ఏదోక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉన్నారు.ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ట్రోల్స్ చేసినా కూడా వేణు స్వామి మాత్రం మారడం లేదు.
అంతేకాకుండా ఏకంగా మహిళా కమిషన్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఆయన బుద్ధి మార్చుకోవడం లేదు.ఎవరో ఒక సెలబ్రిటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లేని పోనీ కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నారు వేణు స్వామి.
ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉంటాయి అనేది వారి పేరు విషయాలను బయట పెట్టకుండా పరోక్షంగా వారిపై సంచలన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

ఆ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.ముఖ్యంగా ఒక హీరో కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry ) మొత్తం సర్వనాశనం అవుతుంది అంటూ వేణు స్వామి చేసిన కామెంట్లు ఆ హీరో అభిమానులను బాగా హర్ట్ చేశాయి.వేణు స్వామి ఎక్కువగా ప్రభాస్, నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటారు.
నాగ చైతన్యకి( Naga Chaitanya ) పెళ్లి కూడా కలిసి రాదని రెండో పెళ్లి కూడా పెటాకులు అవుతుందని చెప్పాడు.అలాగే ప్రభాస్( Prabhas ) కి ఆరోగ్యం సహకరించదని,ఆయన ఎప్పుడూ అనారోగ్యం బారిన పడతారని తెలియజేశారు.
ఇక రీసెంట్ గా ఆయన మాట్లాడిన ఒక ఆడియో కాల్ కూడా వైరల్ అయింది.ఆ ఆడియో కాల్ లో సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరు సూసైడ్ చేసుకుంటారని, ప్రభాస్ కి ప్రాణగండం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉంటే ఎప్పుడు అల్లు అర్జున్ మీద పాజిటివ్ గా కామెంట్లు చేసే వేణు స్వామి తాజాగా సంచలన కామెంట్లు చేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీ పతనం మొత్తం స్టార్ట్ అయిందని,అది కూడా అల్లు అర్జున్ వల్లేనని, అల్లు అర్జున్( Allu Arjun ) వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ పతనం అవ్వబోతుందని, అల్లు అర్జున్ చేసిన పనికి తెలుగు ఇండస్ట్రీ బుగ్గిపాలు అవ్వబోతుంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.అంతేకాదు అల్లు అర్జున్ మీద శని ఉందని, ఆ శని ప్రభావం జైలుకు వెళ్లడంతో కొంతమేర తగ్గినప్పటికీ ఇంకొంత మాత్రం అలాగే ఉంది అని, డైరెక్టర్ సుకుమార్( Director Sukumar ) అల్లు అర్జున్ మధ్య విభేదాలు వచ్చి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని తెలిపారు.అంతేకాదు వీరిద్దరి జాతకాల ప్రకారం కచ్చితంగా త్వరలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వస్తాయని తెలియజేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ పతనం అవ్వడానికి కారణం అల్లు అర్జున్ అయ్యాడు అంటూ వేణు స్వామి మాట్లాడిన మాటలు అల్లు అభిమానులకు అస్సలు రుచించడం లేదు.దీంతో అల్లు అర్జున్ అభిమానులు వేణు స్వామి మీద ఒక రేంజ్ లో మండిపడుతున్నారు.
పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు.