అలేఖ్య చిట్టి పికిల్స్( Alekhya Chitti Pickles ) ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సరికొత్త బిజినెస్లను ప్రారంభిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.
అలాగే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ సైతం తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఎత్తున నాన్ వెజ్ పికిల్స్ ప్రమోట్ చేస్తూ బిజినెస్ చేస్తున్నారు.అతి తక్కువ సమయంలోనే వీరి బిజినెస్ మంచి సక్సెస్ అందుకుంది అయితే ఎప్పటినుంచో వీరు తయారు చేసే పికిల్స్ కాస్త ధరలు ఎక్కువ అనే టాక్ వినపడుతూనే ఉంది.
తమ పికల్స్ చాలా క్వాలిటీతో ఉంటాయి కనుక ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందంటూ ఈ సిస్టర్స్ చెప్పుకు వచ్చారు.అయితే ఇటీవల ఒక కస్టమర్ అలేఖ్య పికిల్స్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటూ దండం పెట్టేసారు.ఇలా ధరలు ఎక్కువగా ఉన్నాయి అన్నందుకు ఈ అక్కచెల్లెళ్లలో అలేఖ్య అనే అమ్మాయి బండ బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ చేశారు అయితే ఆ కస్టమర్ ఆ వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వీరిపై విమర్శలు వచ్చాయి.సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరగడంతో దెబ్బకు పికిల్స్ బిజినెస్ కూడా క్లోజ్ చేశారు.
పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్న అలేఖ్య సిస్టర్స్( Alekhya Sisters ) కు బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి.తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం త్వరలోనే సీజన్ 9 ప్రారంభం కాబోతోంది.ఈ కార్యక్రమానికి ఎక్కువగా కాంట్రవర్సీ కంటెస్టెంట్లే కావాలి.అందుకే అలేఖ్య పికిల్స్ సిస్టర్స్ లో ఒకరిని బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.ఈ విషయం గురించి స్వయంగా జియో హాట్ స్టార్( Jio Hot Star ) పరోక్షంగా వెల్లడించారు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఛత్రపతి సినిమాలోని పచ్చళ్ల సీన్ వీడియోను అందులో షేర్ చేశారు.
‘ గెప్ వీ ఆర్ ఇన్ పికిల్.ఇప్పుడు మిర్చి కావాలి అంటే.
మన హాట్ స్టార్ లోనే చూడాలి’ అంటూ ఈ వీడియోకు ఒక క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు.అయితే ఈ విషయం గురించి బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి ( Adi Reddy ) కూడా వెల్లడించారు.