గత రాత్రి ఐపిఎల్ ఎంతో అట్టహాసంగా ముగిసింది.ఎంతోమంది అభిమానులు, ప్రముఖుల మధ్య ఐపీఎల్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఐపీఎల్ ఫైనల్ లో పెద్ద ఎత్తున సందడి చేశారు.ఈ క్రమంలోనే రణవీర్ సింగ్ కేజిఎఫ్, మాస్టర్ సినిమాలోని పాటలకు కాలు కలుపుతూ అభిమానుల సందడి చేశారు.
ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన RRR చిత్రం నుంచి నాటు నాటు తెలుగు పాటను ప్లే చేశారు.
ఈ క్రమంలోనే ఈ పాటకు హీరో రణవీర్ సింగ్ అద్భుతమైన స్టెప్పులతో రెచ్చిపోయి డాన్స్ చేశారు.
ఈ విధంగా ఈ పాటకు రణవీర్ సింగ్ డాన్స్ చేయడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా కేకలతో మార్మోగిపోయింది.ఇకపోతే ఐపీఎల్ ఫైనల్ లో తెలుగు పాటను ప్లే చేయడంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం.
ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల ఐపీఎల్ ముగింపు వేడుకలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి దూరంగాఉంది.ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపిఎల్ ముగింపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి టీమిండియా మాజీ హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి హోస్ట్ గా వ్యవహరించారు.
ఇలా ఐపీఎల్ ముగింపు వేడుకల్లో భాగంగా బాలీవుడ్ హీరో రణవీర్ సందడి చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.