తెలంగాణపై బీజేపీ ఫోకస్.. అగ్రనేతల వరుస పర్యటనలు

తెలంగాణపై కమలనాథులు ప్రత్యేక దృష్టి సారించారు.ఈ మేరకు రాష్ట్రంలో అగ్రనేతలు పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

 Bjp's Focus On Telangana.. Series Of Visits By Top Leaders ,narendra Modi, Bhad-TeluguStop.com

వరుసగా మూడు రోజులు ముగ్గురు బీజేపీ నేతల పర్యటనలు ఉండనున్నాయి.ఇవాళ జేపీ నడ్డా, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ), తరువాతి రోజు అమిత్ షా ( Amit Shah )పర్యటించి.

బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారాన్ని చేపట్టనున్నారు.ఇందులో భాగంగా జేపీ నడ్డా ఇవాళ తెలంగాణకు రానున్నారు.

మొత్తం మూడు చోట్ల ఆయన పర్యటించనున్నారని తెలుస్తోంది.

ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem ) కొత్తగూడెంలో నిర్వహించే జనసభ బహిరంగ సభకు హాజరుకానున్నారు.తరువాత మహబూబాబాద్ లోని ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.తరువాత మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని నిజాంపేట జేపీ నడ్డా రోడ్ షో నిర్వహించనున్నారు.

రాత్రి ఐటీసీ కాకతీయలో పార్టీ నాయకులతో సమావేశం అవుతారు.ఈ క్రమంలో రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube