టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది.ఉండవల్లిలోని కరకట్టపై చంద్రబాబు గెస్ట్ హౌస్ ను రాష్ట్ర సర్కార్ అటాచ్ చేసింది.
క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేసినట్లు తెలుస్తోంది.క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణలో భాగంగా చర్యలు తీసుకుంది.
లింగమనేనికి అనుకూలంగా వ్యవహారించి గెస్ట్ హౌస్ తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో న్యాయమూర్తికి సమాచారం ఇస్తూ కరకట్టప ఉన్న గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.