1.చంద్రబాబుపై హత్యాయత్నం కేసు
చిత్తూరు జిల్లా అంగళ్లు జరిగిన దర్శనాలపై హత్యాయత్నం , నేరపూరిత కుట్ర కింద టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఏ 1 చంద్రబాబు నాయుడు ఉన్నారు.
2.చిరంజీవికి మంత్రి రోజా సవాల్
ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేసిన మెగాస్టార్ చిరంజీవి పై ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు.గడపగడపకు చిరంజీవి వచ్చి చూస్తే తాము ఏం అభివృద్ధి చేశామో, ఎన్ని రోడ్లు వేసామో తెలుస్తుందని మండిపడ్డారు.
3. ఐటీ టవర్ ప్రారంభించిన కేటీఆర్
నిజామాబాద్ ఐటీ టవర్ ను బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
4.మహేష్ మహేష్ బాబు కి విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
5.లోకేష్ పై ఎమ్మెల్యే కాసు విమర్శలు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.300 కోట్లతో భవనం నిర్మించారని అందుకే నారా లోకేష్ ను సారా లోకేష్ అంటారని మహేష్ విమర్శించారు.
6.పవన్ కళ్యాణ్ కామెంట్స్
అడవి బిడ్డలకు విద్య వైద్యం అందుబాటులో ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఆదివాసి దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు ప్రేమకు పూర్వక శుభాకాంక్షలు పవన్ తెలియజేశారు.
7.నేడు కళ్యాణమస్తు షాధి తోపా నిధులు విడుదల
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోప మూడో విడత ఆర్థిక సహాయాన్ని నేడు విడుదల చేయనుంది.
8.భారత్ జోడో యాత్ర రెండో దశ
భారత్ జోడో యాత్ర తొలి దశకు విశేష స్పందన లభించిన నేపథ్యంలో రెండో దశను ప్రారంభించేందుకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు.మహారాష్ట్రలో ఈ యాత్రను చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు.ఆగస్టు 16న కోర్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
9.పొంగులేటి కామెంట్స్
తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ.కాంగ్రెస్ ను గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలని ఖమ్మం మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
10.చిరంజీవి వ్యాఖ్యలపై ఉండవల్లి కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి చేసిన విమర్శలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. చిరు చెప్పినట్లు సినీ పరిశ్రమ నిజంగా పిచ్చుకే కానీ చిరంజీవి మాత్రం కాదన్నారు.
11.ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు
ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి విమర్శించారు.
12.నా భూమి నా దేశం కార్యక్రమం ప్రారంభం
నెల్లూరు జిల్లాలో ఆగస్టు 9 నుంచి 30 వరకు నా భూమి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
13.మలయాళ స్టార్ డైరెక్టర్ మృతి
ప్రముఖ మలయాళ స్టార్ దర్శకుడు సిద్ధికి మరణించారు.సోమవారం గుండెపోటుకు గురైన సిద్దికిను ఆయన కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.చికిత్స తీసుకుంటు ఆయన మృతి చెందారు.
14.మహేష్ కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
15.ఈ ఏపీ సెట్ వెబ్ ఆప్షన్ ఎంపికకు గడువు పెంపు
ఈ ఏపీ సెట్ అడ్మిషన్ల ప్రక్రియల్లో ఆప్షన్ల ఎంపికకు గడువును పొడిగించారు.ఆగస్టు 7 నుంచి ఈ ఏపీ సెట్ 2023 కు సంబంధించిన వెబ్ ఆప్షన్ ఎంట్రీ ప్రారంభమైంది.ఆగస్టు 14వ తేదీ వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.ఆగస్టు 16న ఆప్షన్ల మార్పుకు అవకాశం కల్పించారు.
16.జగన్ పై రఘురామ విమర్శలు
వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ పై సెటైర్లు వేశారు.తాడేపల్లి ప్యాలెస్ వదిలి జగన్ పోలవరంలో ఉన్న నేతలను కలుస్తున్నారని మామూలుగా జగన్ ఎవరిని కలవరని ,కానీ ఎమ్మెల్యేల తిరుగుబాటు అవుతుందని గ్రహించి ఇప్పుడు కలుస్తున్నారని రఘురామ సెటైర్లు వేశారు.
17.కొడాలి వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానుల నిరసన
మెగాస్టార్ చిరంజీవి పై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గుడివాడలో చిరు అభిమానులు ర్యాలీ నిర్వహించారు.కొడాలి నాని కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
18.ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఏడు పేపర్లు
పదో తరగతి పరీక్షల్లో గత ఏడాది ఆరు పేపర్లతో పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా , ఈ ఏడాది ఏడు పేపర్ల విధానం ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
19.ఆర్టీసీకి తిరుమల దర్శన టికెట్ల కోట పెంపు
ఏపీ ఆర్టీసీ బస్సులు ప్రయాణించి తిరుమలకు చేరుకునే వారికి అందించే దర్శన టికెట్ల కోటను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది .మొన్నటివరకు రోజు ఆర్టీసీ ప్రయాణికులకు రాష్ట్రవ్యాప్తంగా 600 టికెట్లు ఇస్తుండగా వీటిని 1000 కి పెంచింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 54,950
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 59,950
.