1.గాంధీభవన్ లో అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్లోని గాంధీ భవన్లో అఖిలపక్ష సమావేశం గురువారం ప్రారంభమైంది.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
2.గోదావరి నది యాజమాన్య బోర్డు ఉప సంఘం సమావేశం
గోదావరి నది యాజమాన్య బోర్డు ఉప సంఘం సమావేశం గురువారం ప్రారంభమైంది.
3.హుస్నాబాద్ లో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభ ను అక్టోబర్ 2న హుస్నాబాద్ లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బిజెపి ప్రకటించింది.
4.4 నుంచి పీజీ ప్రవేశాల ప్రక్రియ
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియ అక్టోబర్ 4 నుంచి ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
5.అక్టోబర్ 4 నుంచి పీజీఈసెట్ కౌన్సెలింగ్
తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ ,ఎం ఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 4వ తేదీ నుంచి తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రవేశాల కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు.
6.నేడు హైదరాబాద్ కు మాణిక్యం ఠాకూర్
ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ గురువారం హైదరాబాద్కు రానున్నారు మూడు రోజుల పాటు తెలంగాణలోని వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు.
7.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 27,021 మంది భక్తులు దర్శించుకున్నారు.
8.బంగాళాఖాతంలో అల్పపీడనం
తూర్పు మధ్య బంగాళాఖాతం పతంలో ఉన్న అల్పపీడనం తీవ్ర అల్ప పీడనంగా బలపడింది.అది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది.
9.ఈసీ పర్యవేక్షణలో బతుకమ్మ చీరల పంపిణీ
హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీ ఎన్నికల అధికారుల పర్యవేక్షణలోనే జరగాలి అని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు.
10.రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాలు
గుంటూరు జిల్లాలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాలు జరుగుతున్నాయి.
11.గల్లా కుటుంబం పై భూఆక్రమణ కేసు నమోదు
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తో పాటు గల్లా రామచంద్ర నాయుడు తో సహా 12 మందిప భూఆక్రమణ కేసు నమోదయింది.
12. కౌలు చెల్లించ లేదంటూ అమరావతి రైతుల పిటిషన్
రాజధాని భూములు ఇచ్చిన రైతులు లో కొంతమందికి కౌలు చెల్లించ లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
13.పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఏపీ లోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 70, 249 సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్య కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు.
14.నేడు పార్టీ కార్యాలయానికి రానున్న జనసేన అధినేత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి రానున్నారు.
15.ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం బేటీ
ఏపీకి చెందిన ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ గురువారం భేటీ అయ్యారు.
16.వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్
వైయస్సార్ ఆర్ కడప జిల్లాలో ఉన్న వైయస్సార్ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు 4,5 తరగతులకు నోటిఫికేషన్ వెలువడింది.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( శాప్ ) ఆధ్వర్యంలో మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
17.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 1,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకిరామ్ రెడ్డి
ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకి రామ్ రెడ్డి 455 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి కె సత్యనారాయణ మూర్తి పై విజయం సాధించారు.
19.5న వీఐపీ బ్రేక్ దర్శనం లేదు : టీటీడీ
అక్టోబర్ 5 న తిరుమలలో బ్రేక్ దర్శనం నిలిపివేస్తున్నట్లు టిడిపి పిఆర్వో విభాగం ప్రకటించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -45, 110 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,110