అల్లు అర్జున్( Allu Arjun ) హీరో గా సుకుమార్( Sukumar ) దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందంటూ ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.షూటింగ్ కి వారం రోజుల గ్యాప్ ఇచ్చి దర్శకుడు సుకుమార్ చెన్నై వెళ్లాడట.
దేవి శ్రీ ప్రసాద్( Devi Shri Prasad ) సినిమా కోసం మూడు పాటలను రెడీ చేశాడని, వాటిని ఫైనల్ చేసేందుకు దర్శకుడు చెన్నై వెళ్లాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.అల్లు అర్జున్ కూడా అతి త్వరలోనే చెన్నై వెళ్లబోతున్నాడని సమాచారం అందుతుంది.
సినిమా చిత్రీకరణ ఒక వైపు జరుగుతూనే మరో వైపు మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి.కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇంత స్పీడ్ గా వర్క్ జరుగుతున్నా కూడా ఈ సంవత్సరం లో సినిమా ను విడుదల చేసే అవకాశాలు లేవంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుంది అనే విషయమై క్లారిటీ లేక అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమా కథ ను రెడీ చేశాడు.తెలివి తో పాటు ఇతర భాషల్లో కూడా భారీ గా సినిమా వస్తువులు రాబట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
అతి త్వరలోనే పుష్ప 2 సినిమా ఫస్ట్ లుక్ రాబోతుంది.ఉగాది కి లేదా ఆ తర్వాత టీజర్ ని కూడా విడుదల చేసే ఉద్దేశం తో దర్శకుడు సుకుమార్ పని చేస్తున్నాడు అని తెలుస్తుంది.
రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయబోతుందని సమాచారం అందుతుంది.బాలీవుడ్ స్టార్స్ పలువురు ఈ సినిమా లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.