బాలీవుడ్ లో కొందరు స్టార్ నటీనటులు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని చిన్నచూపు చూశారు.కానీ ప్రస్తుతం అదే సెలబ్రిటీలు తెలుగు సినిమాల పై కన్నేశారు.
బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్లు, హీరోలు, నటీనటులు తెలుగు సినిమాల్లో నటించడానికి మొగ్గుచూపుతున్నారు.ఇప్పటికే కొందరు హీరోయిన్ లు వారికీ తెలుగు సినిమాలలో నటించాలి అన్న కోరిక ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా త్వరలోనే తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తాజాగా బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
చాలా కాలం తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ.ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లి పాత్రలో నటిస్తోంది.
ఇక భాగ్యశ్రీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.అనంతరం పెళ్లి తరువాత భర్త, పిల్లలు బాధ్యతల కారణంగా సినిమాలకు దూరం అయింది.
ఇక రాధేశ్యామ్ సినిమాతో రీ ఎంట్రీతో వెండితెరపై అలరించబోతోంది భాగ్యశ్రీ.రాధే శ్యామ్ సినిమా మార్చి 11 న విడుదల కానున్న విషయం తెలిసిందే.
విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా నటి భాగ్యశ్రీ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ బాలీవుడ్ లో ప్రస్తుతం అన్ని పాత కథలు, కాఫీ స్క్రిప్టు వస్తున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.తెలుగు, మలయాళ సినిమాలు కొత్త కొత్త కాన్సెప్ట్ లు, స్క్రిప్ట్ లు, కొత్త కథలు వస్తున్నాయని తెలిపింది.అదే విధంగా కొత్త టాలెంటు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వల్ల సినిమా స్థాయి రోజురోజుకు ఇంటర్నేషనల్ స్థాయికి మారుతోందని, ఈ క్రమంలోనే ప్రజలు పాన్ ఇండియా సినిమా కథలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని తెలిపింది భాగ్యశ్రీ.