బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి మండలి ఛైర్మన్ గుత్తా కుమారుడు అమిత్ రెడ్డి..!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్( BRS ) కు మరో షాక్ తగిలింది.తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు.

 A Shock To Brs.. Council Chairman Gutta's Son Amit Reddy Joins Congress Amit Red-TeluguStop.com

రాష్ట్ర ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో గుత్తా అమిత్ రెడ్డి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.అయితే గత కొంతకాలంలో బీఆర్ఎస్ తీరుపై గుత్తా అమిత్ రెడ్డి( Amit Reddy ) అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

నల్గొండ, భువనగిరి బీఆర్ఎస్ టికెట్ ను ఆశించి ఆయన భంగపడ్డారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్న అమిత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube