పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్( BRS ) కు మరో షాక్ తగిలింది.తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు.
రాష్ట్ర ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో గుత్తా అమిత్ రెడ్డి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.అయితే గత కొంతకాలంలో బీఆర్ఎస్ తీరుపై గుత్తా అమిత్ రెడ్డి( Amit Reddy ) అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.
నల్గొండ, భువనగిరి బీఆర్ఎస్ టికెట్ ను ఆశించి ఆయన భంగపడ్డారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్న అమిత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.