నోటుకు వోటు కేసులో ప్రధాన నిందితుడైన కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరు కాగా, ఇదే రోజు అక్రమ ఆస్తుల కేసులో నిందితుడైన వై కా పా అధినేత జగన్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులైన సెబాస్టియన్, ఉదయసింహ కూడా వచ్చారు.
ఈ నెల (ఆగస్టు) 3వ తేదీ తరువాత ఈ ముగ్గురు ఇప్పుడు కోర్టుకు హాజరయ్యారు.జగన్ విషయానికి వస్తే సీబీఐ చార్జిషీటు ఆధారంగా ఈడీ క్విడ్ ప్రో కో ఆరోపణకు సంబంధించి కేసులు పెట్టింది.
వై ఎస్ ఆర్ ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందిన వారు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి.ఈ కేసులో జగన్తో పాటు ఆయన ఆర్ధిక సలహాదారు విజయసాయి కూడా కోర్టుకు హాజరయ్యారు.