ఇద్దరూ కోర్టులకు హాజరు

నోటుకు వోటు కేసులో ప్రధాన నిందితుడైన కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరు కాగా, ఇదే రోజు అక్రమ ఆస్తుల కేసులో నిందితుడైన వై కా పా అధినేత జగన్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులైన సెబాస్టియన్, ఉదయసింహ కూడా వచ్చారు.

 Ys Jagan And Revanth Appears In Courts-TeluguStop.com

ఈ నెల (ఆగస్టు) 3వ తేదీ తరువాత ఈ ముగ్గురు ఇప్పుడు కోర్టుకు హాజరయ్యారు.జగన్ విషయానికి వస్తే సీబీఐ చార్జిషీటు ఆధారంగా ఈడీ క్విడ్ ప్రో కో ఆరోపణకు సంబంధించి కేసులు పెట్టింది.

వై ఎస్ ఆర్ ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందిన వారు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి.ఈ కేసులో జగన్తో పాటు ఆయన ఆర్ధిక సలహాదారు విజయసాయి కూడా కోర్టుకు హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube