తమిళ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం ‘మాస్’.ఈ సినిమాను మే 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఇక ఈ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ అనే టైటిల్తో డబ్ చేశారు.ఇప్పటికే తమిళం మరియు తెలుగులో ఆడియోను విడుదల చేసారు.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులతో పాటు, సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఇక ఈ సినిమాను అక్కడ గతంలో ఎప్పుడు లేనంతగా ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉంది.
తెలుగులో సూర్యకు మంచి గుర్తింపు ఉంది.
ఆ గుర్తింపును ఉపయోగించుకుని ఈ సినిమాతో నిర్మాతలు మంచి బిజినెస్ చేశారు.తెలుగులో కూడా ఈ సినిమాను సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 550 థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.విడుదల సమయం దగ్గర పడుతున్నా కొద్ది థియేటర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి.
తమిళ సినీ వర్గాల వారు ఈ సినిమాను వంద కోట్ల సినిమాగా అభివర్షిఉ్తన్నారు.ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్లో నటించాడు.
నయనతార మరియు ప్రణీతలు హీరోయిన్స్గా నటించారు.