తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ‘ప్రొడ్యూసర్స్ సిండికేట్’ హాట్ టాపిక్గా నడుస్తోంది.పెద్ద నిర్మాతలు అంతా కలిసి చిన్న నిర్మాతలను తొక్కేసేందుకు ఈ సిండికేట్ను ఏర్పాటు చేశారు అంటూ ఇప్పటికే పలువురు నిర్మాతలు ద్వజం ఎత్తుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా దానిపై తన గళ్లాన్ని ఎత్తాడు.తాజాగా నటుడు, నిర్మాత అయిన మోహన్బాబు ఈ విషయంపై ఫైర్ అయ్యాడు.
ఫైనాన్సియర్స్ అమౌంట్ను క్లీయర్ చేయకుండా నాటకాలు ఆడుతూ, ప్రొడ్యూసర్స్ సిండికేట్లో చెలామణి అవుతున్న వారికి గట్టి బుద్ది చెప్తాం అంటూ మోహన్బాబు చెప్పుకొచ్చాడు.తెలుగు సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిదో లేక ఏ ఒక్క సంస్థకు చెందిందో కాదని మోహన్బాబు చెప్పుకొచ్చాడు.
సినిమా పరిశ్రమ అంటే అందరిదని, అందరికి ఇక్కడ సమాన హక్కులు ఉంటాయంటూ తనదైన స్టైల్లో దీని వెనుక ఉన్న వారిపై విమర్శలు చేశాడు.