ఏపీలోని ప్రతిపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) మండిపడ్డారు.తమపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యారంగాన్ని అభివృద్ధి చేశామని మంత్రి బొత్స పేర్కొన్నారు.నాడు – నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేశామని తెలిపారు.
ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు ( Chandrababu naidu )వ్యతిరేకించారని చెప్పారు.కానీ జగన్ పాలనలో విద్యారంగంలో కీలక సంస్కరణలు చోటు చేసుకున్నాయి.
ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండటంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని మంత్రి బొత్స తెలిపారు.