మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు సాయిధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) ఒకరు.వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి ధరమ్ తేజ్ గతంలో రోడ్డు ప్రమాదానికి ( Road Accident ) గురైన సంగతి మనకు తెలిసిందే.
ఇలా బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి ఈయన కోమాలోకి కూడా వెళ్లారు.ఈ ప్రమాదం తర్వాత దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈయన తిరిగి విరూపాక్ష ( Virupaksha ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా ప్రమాదం తర్వాత బయటపడినటువంటి ఈయన ఎక్కడ మాట్లాడిన అభిమానులను జాగ్రత్త వహించమని బైక్ పై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్( Helmet ) తప్పనిసరి కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరి అంటూ జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.తాజాగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజరా హిల్స్లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు( Road Safety Awareness Drive ) నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సాయి ధరమ్ తేజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే కారులో వెళ్లే వాళ్ళు సీట్ బెల్ట్( Seat Belt ) పెట్టుకోవాలని మద్యం తాగి ఎవరు బండి నడపొద్దని ఈయన తెలిపారు.అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించమని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఈయన అభిమానులను కోరారు.ఇక తాను కూడా ఈ ప్రమాదాన్ని ఫేస్ చేశానని అయితే మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను తిరిగి పునర్జన్మ పొందానని ఇది నాకు రెండో జన్మ అంటూ ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.