బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.ప్రభుత్వంపై కుట్రలు చేస్తే వారిని ప్రజలే నామరూపాలు లేకుండా చేస్తారని తెలిపారు.
బండి సంజయ్ తాజా వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్ఎస్ కు మధ్య ఉన్న మైత్రి బయటపడిందని అద్దంకి దయాకర్ తెలిపారు.బీజేపీ, బీఆర్ఎస్ అనైతిక రాజకీయంపై తమకు అవగాహన ఉందని చెప్పారు.
అయితే రెండు పార్టీలకు మించి రాజకీయం చేసే శక్తి కాంగ్రెస్ కు ఉందని తెలిపారు.ఇది ప్రజల ప్రభుత్వమన్న ఆయన ప్రజలే కాపాడుకుంటారని వెల్లడించారు.